వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్‌ఛేంబర్‌ ఎదుట టిడిపి ధర్నా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:శాసనసభలోని స్పీకర్‌ ఛేంబర్‌ వద్దతెలుగుదేశం శాసనసభ్యులుధర్నాకు దిగారు. పరిటాల రవిపైచర్చను కొనసాగించకుండా సభనువాయిదా వేసినందుకు నిరసనగావారు శుక్రవారం ఈ ధర్నాకుచేపట్టారు. అంతకు ముందు పరిటాల రవిహత్యపై చర్చ సందర్భంగాతెలుగుదేశం సభ్యుడు నాగంజనార్దన్‌ రెడ్డికి, కాంగ్రెస్‌ సభ్యుడువసంత్‌కుమార్‌కు మధ్య తీవ్రవాగ్వివాదం చెలరేగింది. ఒకానొకసందర్భంలో తెలుగుదేశం సభ్యులుస్పీకర్‌ పోడియం వద్దకుదూసుకెళ్లారు.

అనంతరంవివిధ శాసనసభా పక్ష నాయకులు పరిటాలరవి హత్యపై చర్చను ముగించి ప్రజాసమస్యలపై చర్చను చేపట్టాలనిస్పీకర్‌ను కోరారు. పరిటాల రవిహత్యపై చర్చను ఈ రోజే ముగించాలనివారు కోరారు. దీనికి శాసనసభావ్యవహారాల మంత్రి కె. రోశయ్యసమ్మతిస్తూ హోం మంత్రి కె. జానారెడ్డిసమాధానం ఇస్తారని, ఆ సమాధానంతర్వాత సభ్యులు సందేహాలనుతీర్చుకునే అవకాశం ఉంటుందనిచెప్పారు. ప్రతిపక్ష నాయకుడినైనతనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలనితెలుగుదేశం అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు స్పీకర్‌నుకోరారు. అధ్యక్ష స్థానంలో ఉన్ననర్సిరెడ్డి అందుకు అంగీకరించిమాట్లాడాల్సిందిగా చంద్రబాబునుకోరారు.

చంద్రబాబుమాట్లాడేందుకు సిద్ధపడిన వెంటనేకాంగ్రెస్‌ సభ్యుల నుంచి తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కానిపరిస్థితి ఏర్పడింది. దీంతో సభనుస్పీకర్‌ సోమవారంనాటికి వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. దీన్నినిరసిస్తూ తెలుగుదేశం సభ్యులుస్పీకర్‌ కె. ఆర్‌. సురేష్‌ రెడ్డి ఛాంబర్‌ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికివ్యతిరేకంగా నినాదాలు చేశారు. బైటగొంతులు కోస్తున్నారు, లోపల గొంతులునొక్కుతున్నారు వంటి నినాదాలతో గలప్లకార్డులను ప్రదర్శించారు. వుయ్‌వాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X