బీహార్లోలౌకిక ప్రభుత్వమే వస్తుంది: అంబికాసోనీ
న్యూఢిల్లీ:బీహార్లో లౌకిక ప్రభుత్వమేఏర్పడుతుందని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి అంబికా సోనీ విశ్వాసం వ్యక్తంచేశారు. బీహార్లో లౌకిక ప్రభుత్వఏర్పాటుకు సహకరిస్తే రైల్వే శాఖ ఇస్తామనిలోక్ జనశక్తి నేత రాం విలాస్పాశ్వాన్కు కాంగ్రెస్ ఆశచూపుతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఎన్నికల ఫలితాలువెలువడడం ప్రారంభం కాగానేవెలవెలబోయిన రాష్ట్రీయ జనతాదళ్నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిలోసందడి మొదలైంది.
బీహార్ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగాఓటేశారనే అభిప్రాయం వాస్తవం కాదనిఅంబికా సోనీ విలేకరులతో అన్నారు. తాముప్రతిపక్షంలో కూర్చుంటామని పాశ్వాన్చేసిన వ్యాఖ్యపై మాట్లాడడానికి ఆమెనిరాకరించారు. బీహార్లో ప్రభుత్వానికివ్యతిరేకంగా ప్రజలు ఓటేశారనేఅభిప్రాయాన్ని ప్రస్తావిస్తే ప్రభుత్వానికివ్యతిరేకంగా పోరాడిన బిజెపి, జెడి(యు) కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయని ఆమెఅడిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగాప్రజలు ఓటేసి వుంటే బిజెపి, జెడి (యు) సీట్లుపెరగాలి కదా అని ఆమె అన్నారు.