ఆర్జేడీప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్మంత్రాంగం?
పాట్నా:బీహార్ శాసనసభ ఎన్నికల్లో రాం విలాస్పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి(యల్జెపి) కీలక పార్టీగా అవతరించింది.ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ బీహార్శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిమెజారిటీ రాలేదు. బిజెపి కూటమికిఅత్యధిక సీట్లు వచ్చినప్పటికీ ఐక్యప్రగతిశీల కూటమిలో తలెత్తిన విభేదాలవల్ల అది లాభపడలేకపోయింది. ఓటర్లతీర్పు తమ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడి) అనుకూలంగా లేకపోవడంతోరబ్రీదేవి ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేశారు. ఆమె రాఘవాపూర్నియోజకవర్గం నుంచి 21 వేల ఓట్లమెజారిటీతో విజయం సాధించారు.
ప్రభుత్వాన్నిఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగాఉన్నామని రాష్ట్రీయ జనతాదళ్నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ప్రకటించారు. యల్జెపి నాయకుడురాం విలాస్ పాశ్వాన్కు ఆర్జేడీ ప్రభుత్వఏర్పాటుకు రైల్వే శాఖను కాంగ్రెస్ఇవ్వజూపుతున్నట్లు సమాచారం.
బిజెపికూటమికి 85 సీట్లు రాగా, ఆర్జేడీ కూటమికి 68సీట్లు వచ్చాయి. ఇతరులు 78 సీట్లుగెలుచుకున్నారు. ఆర్జేడీని అధికారంనుంచి దించాలన్న కోరికను పాశ్వాన్నెరవేర్చుకున్నట్లే. ఎల్జిపి 27 సీట్లుగెలుచుకుంది. ఇతరులకు 31 సీట్లుదక్కాయి. ఆర్జేడీ కాంగ్రెస్తో పొత్తువిషయంలో మొండిపట్టు పట్టినందుకుతగిన ఫలితం అనుభవించారు. ఆర్జేడీనేత లాలూ ప్రసాద్ యాదవ్మొండివైఖరి వల్ల పొత్తుకుదరకపోవడంతో కాంగ్రెస్ఎల్జెపికి మద్దతు ఇచ్చింది. దీంతోకాంగ్రెస్ పెద్దగాలాభపడకపోయినప్పటికీ ఆర్జేడీదెబ్బ తినడానికి మాత్రం కారణమైంది.కాంగ్రెస్కు ఏడు సీట్లు లభించినట్లుసమాచారం.