ధరతగ్గించకుంటే స్పెక్ట్రమ్ గతేఅన్నింటికీ: వైయస్
రాజమండ్రి:విద్యుత్ కొనుగోళ్ల ధరలనుప్రైవేట్ విద్యుత్ కంపెనీలు తగ్గించాలనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి కోరారు. విద్యుత్కొనుగోళ్ల ధరలు తగ్గించకపోతేస్పెక్ట్రమ్ కంపెనీపై జరిపిస్తున్నట్లేమిగతా ప్రైవేట్ కంపెనీలపై కూడాసిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశిస్తామనిఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలోశనివారం రాజీవ్నగర బాటల్లోపాల్గొన్న ఆయన ఆదివారం రాజమండ్రిలోవిలేకరులతో మాట్లాడారు.
స్పెక్ట్రమ్విద్యుత్ కోనుగోలు ఒప్పందంపై సిబిసిఐడిదర్యాప్తు జరుగుతోందని ఆయనచెప్పారు. స్పెక్ట్రమ్ కొనుగోలు ధరపెంచిందని ఆయన చెప్పారు. విద్యుత్కొనుగోళ్ల విషయంలో ఆర్థిక మంత్రి కె.రోశయ్య నేతృత్వంలోని కమిటీచేసిన సూచనలను పరిగణనలోకితీసుకుంటామని ఆయన చెప్పారు.రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత పరిశ్రమలనునెలకొల్పుతామని, అయితే ఇందుకు కొంతసమయం పడుతుందని ఆయనఅన్నారు. కాకినాడ నుంచి విశాఖపట్నంవరకు పర్యాటక కారిడార్ను ఏర్పాటుచేస్తామని ఆయన చెప్పారు.