వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరీంనగర్‌జిల్లాలో ఇద్దరు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:కరీంనగర్‌ జిల్లాలో పోలీసులకు,నక్సలైట్లకు మధ్య జరిగినఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లుమరణించారు. కరీంనగర్‌ జిల్లామంథని మండలం గోపాలపురం అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.మరణించినవారిలో ఒక మహిళానక్సలైట్‌ ఉంది.

మరణించిననక్సలైట్లను వసంత, మొగిలిలుగాగుర్తించారు. సంఘటనా స్థలం నుంచిఆయుధాలు, కిట్‌బ్యాగ్‌లు, క్లైమోర్‌మైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లాపోలీసు సూపరింటిండెంట్‌ డి.యస్‌. చౌహాన్‌తెలిపారు. నలుగురైదుగురునక్సలైట్లు తప్పించుకునిపారిపోయారని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, ఆదిలాబాద్‌ జిల్లా తిర్యాణిమండలంలో పోలీసులు నక్సలైట్ల కోసంగాలిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓపెన్‌మైన్‌కాస్ట్‌ నుంచి నక్సలైట్లుదొంగిలించిన జిలిటెన్‌ స్టిక్స్‌ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.

సీరియస్‌విషయాలు చర్చకు వస్తాయనేఉద్దేశంతోనే నక్సలైట్లతోప్రభుత్వం చర్చలకు ముందుకురావడం లేదని మావోయిస్టుల ప్రతినిధి జి.కళ్యాణ్‌రావు విమర్శించారు. తెలంగాణరాష్ట్రం ఏర్పాటు, స్వావలంబనడిమాండ్లను మావోయిస్టులు పెడతారనితెలిసి వాటిని అమలు చేయడం సాధ్యంకాదనే ఉద్దేశంతోనే ప్రభుత్వంచర్చలకు వెనక్కి తగ్గుతోందనిఆయన విలేకరుల సమావేశంలోవిమర్శించారు. తొలి విడత చర్చలసందర్భంగా ఉన్న వాతావరణంనెలకొంటేనే రెండో విడత చర్చలుసాధ్యమవుతాయని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X