పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇద్దరు పిల్లలనిబంధన
న్యూడిల్లీ:ఇద్దరు పిల్లలకు పైగా ఉన్న వారినిపార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా వారిపై నిషేధం విధించాలనిసుప్రీంకోర్టు సోమవారంనాడుకేంద్రానికి, ఆరు రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. అనిల్ కుమార్ హరితాష్పెట్టుకున్న పిటిషన్పై ప్రధానన్యాయమూర్తి ఆర్.సి. లహోటి, జస్టిస్డి.యం. ధర్మాధికారులతో కూడినసుప్రీంకోర్టు బెంచ్ ఆ నోటీసులు జారీచేసింది.
హర్యానా,రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా,ఆంధ్రప్రదేశ్, హిమాచల్ప్రదేశ్రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఇద్దరు పిల్లలకు మించిఉన్నవారిని పంచాయతీరాజ్ ఎన్నికలకుదూరం చేస్తూ నిబంధనను అమలుచేస్తున్నారని అంటూ అదే నిబంధననులోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఎన్నికలకుకూడా వర్తింపజేయాలని పిటిషన్దారుకోరారు. రాజకీయ నాయకులు సమాజానికిరోల్ మోడల్స్ అని, అందువల్ల వారినిసమాజం సంపదను దోచుకునిఅనియంత్రిత జనాభా పెరుగుదలకుకారణమవుతూ ముందు తరాలవారిప్రాథమిక హక్కులను హరించేందులకుఅనుమతించకూడదని హరితాష్అన్నారు.