వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కులాలమధ్య వైరుధ్యం వల్లే వేంపెంటఘటన: జానా
హైదరాబాద్/కర్నూలు: కులాల మధ్యవైరుధ్యమే వేంపెంట సంఘటనకుకారణమని హోం మంత్రి కె. జానారెడ్డిఅన్నారు. వేంపెంటను సందర్శించి వచ్చినఅనంతరం ఆయన శాసనసభలో ఒకప్రకటన చేశారు. బాధితులనుఆదుకోవడానికి ప్రభుతవం అన్ని చర్యలుతీసుకుందని ఆయన చెప్పారు. అడపాదడపా హత్యలకు పాల్పడుతున్నమావోయిస్టులు వేంపెంటలో దారుణమైనఊచకోతకు పాల్పడ్డారని ఆయనఅన్నారు.
జానారెడ్డికులాల పేర్లు ప్రస్తావించడం పట్లతెలుగుదేశం పార్టీ సభ్యుడుచెన్నమనేని రాజేశ్వరరావుఅభ్యంతరం తెలియజేశారు. కులాలపేర్లు ప్రస్తావించడం రాజ్యాంగవిరుద్ధమని ఆయన అన్నారు.
హోంమంత్రి కె. జానారెడ్డి బుధవారంనాడువేంపెంట బాధితులనుపరామర్శించారు. నక్సలైట్ల పట్లప్రభుత్వ వ్యవహార శైలిని వేంపెంటబాధితులు ప్రశ్నించారు. 8 మందినినక్సల్స్ ఊచకోత కోసిన సంఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. హత్యకుగురైనవారి దహన సంస్కారంలో కూడాఆయన పాల్గొన్నారు.
Comments
Story first published: Wednesday, March 2, 2005, 23:53 [IST]