ఆర్జేడీకికాంగ్రెస్ మద్దతు: వ్యతిరేక ఓటుకేపాశ్వాన్
న్యూఢిల్లీ/పాట్నా:రాష్ట్రీయ జనతాదళ్కు తాముమద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ప్రకటించింది. ఈ మేరకు ఒక లేఖనుగవర్నర్ బూటాసింగ్కు, మరో లేఖనుఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్యాదవ్కు పంపింది. అఖిల భారతకాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) కార్యదర్శిహరికేష్ బహాదూర్ ఈ లేఖలను రాశారు.తమ పార్టీకి చెందిన పది మందిశాసనసభ్యుడు ఆర్జేడికి మద్దతుఇస్తారని ఆయన ఆ లేఖలో స్పష్టంచేశారు.
సిపియంనుంచి ఒక లేఖ లాలూ ప్రసాద్ యాదవ్కుఅందింది. సిపియంకు చెందిన ఒకే ఒకసభ్యుడు ఆర్జేడీకి మద్దతుఇవ్వనున్నారు. అలాగే సిపిఐ నుంచి కూడామద్దతు లేఖ అందుతుంది. అయితేలోక్జనశక్తి నాయకుడు రాం విలాస్పాశ్వాన్ మాత్రం తన పట్టును వీడడంలేదు. ఆర్జేడీకి మద్దతు ఇవ్వననిప్రకటించడమే కాకుండా బలనిరూపణసమయంలో ఆర్జేడీకి వ్యతిరేకంగా ఓటుచేస్తామని ఆయన ప్రకటించారు. ఈమూడు పార్టీల మద్దతు కూడా ఆర్జేడికిసరిపోదు. ఈ విషయంలో కాంగ్రెస్ వ్యూహంఏమిటనేది అర్థం కావడం లేదు. పాశ్వాన్పార్టీ ఆర్జేడీకి వ్యతిరేకంగా ఓటు చేస్తేవిశ్వాసం తీర్మానం వీగిపోవడం ఖాయం.