పార్లమెంటుఉభయసభలను కుదిపేసిన జార్ఖండ్
న్యూఢిల్లీ:జార్ఖండ్ ఉదంతం బుధవారంపార్లమెంటు ఉభయసభలోగందరగోళానికి దారి తీసింది. జార్ఖండ్లోప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్భారతీయ జనతా పార్టీ (బిజెపి)నిఆహ్వానించకపోవడంపై జాతీయ ప్రజాస్వామ్యకూటమి (యన్డిఎ) పక్షాలు తీవ్రనిరసనను వ్యక్తం చేశాయి.యన్డిఎ పక్షాల గొడవతో రాజ్యసభకార్యక్రమాలేవీ చేపట్టకుండానేరేపటికి వాయిదా పడింది.
బుధవారంఉదయం సభ సమావేశం కాగానేయన్డిఎ పక్షాలు జార్ఖండ్ గవర్నర్వ్యవహారంపై తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. దాదాపు 20 నిమిషాల గందరగోళంతర్వాత యన్డిఎ పక్షాల సభ్యులువెల్లోకి దూసుకెళ్లి ఐక్య ప్రగతిశీలకూటమికి, కాంగ్రెస్కు వ్యతిరేకంగానినాదాలు చేశారు. రాజ్యసభ చైర్మన్బైరాన్ సింగ్ షెకావత్ పదేపదేవిజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్షాలసభ్యులు పట్టించుకోలేదు. దీంతోచైర్మన్ సభను రేపటికి వాయిదావేశారు.
జార్ఖండ్లోగవర్నర్ తన అధికారాలనుదుర్వినయోగం చేస్తున్నారంటూయన్డిఎ పక్షాల సభ్యులు లోక్సభలోనూగందరగోళం సృష్టించారు. దాంతోసభ 20 నిమిషాల పాటు వాయిదా పడింది. దీంతోఆగ్రహించిన ప్రతిపక్షాల సభ్యులువెల్లోకి దూసుకెళ్లి గవర్నర్సయద సిబ్టి రాజీకి, కాంగ్రెస్అధ్యక్షురాలు సోనియాగాంధీకివ్యతిరేకంగా నినాదాలు చేశారు.