సియంగాసోరేన్, డిసియంగా స్టీఫెన్ మారండిప్రమాణం
రాంచీ/న్యూఢిల్లీ:జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జెయంయంనాయకుడు శిబూ సొరేన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఈ రోజుసాయంత్రం 4 గంటల 45 నిమిషాలకుముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేయాల్సి ఉండగా ఆ కార్యక్రమం దాదాపు 25నిహిషాల ఆలస్యంగా జరిగింది. జెయంయంతిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినస్టీఫెన్ మారండీ యుపిఎకుమద్దతు ప్రకటించారు. ఆయన ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేశారు.
అంతకుముందు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా గవర్నర్ సయ్యద్సిబ్టే రాజీ జార్ఖండ్ ముక్తి మోర్చానాయకుడు శిబు సోరేన్ను ఆహ్వానించారు.మార్చి 21వ తేదీన బలనిరూపణచేసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు.బిజెపి సభ్యులు రాజభవన్వద్ద ధర్నా చేశారు. బిజెపితమకు మద్దతు ఇస్తున్న 41 మందిసభ్యుల పేర్లను గవర్నర్కుసమర్పించగా శిబు సోరేన్ 42 మందిపేర్లను సమర్పించారు. ఐదుగురుఇండిపెండెంట్ సభ్యులు యన్డిఎకుమద్దతు ఇస్తున్నట్లుప్రకటించారు.
జార్ఖండ్గవర్నర్ను రీకాల్ చేయాలని బిజెపిడిమాండ్ చేస్తోంది. గవర్నర్చర్య అప్రజాస్వామికమని భారతీయ జనతాపార్టీ (బిజెపి) విమర్శించింది. శిబు సోరేన్నుప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్పిలవడం రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టించడమేనని బిజెపి నేత అరుణ్జైట్లీ విమర్శించారు. ఇలాంటి సంఘటనలుఎమర్జెన్సీలో జరిగాయని, కాంగ్రెస్ పార్టీఎమర్జెన్సీ సంఘటనలనుపునరావృతం చేస్తోందని ఆయనఅన్నారు. తమ వద్ద 41 మందిసభ్యులున్నప్పుడు శిబు సోరేన్కు 42మంది సభ్యులు బలం ఎలా ఉంటుందని ఆయనప్రశ్నించారు. శాసనసభ మొత్తంసభ్యులు సంఖ్య 91. ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ నేతలు గవర్నర్చేత ఈ పనులు చేయిస్తున్నారని ఆయనవిమర్శించారు.