రైతు సమస్యలపై పవార్ను కలిసిన టిడిపి ఎంపీలు
న్యూఢిల్లీ:రాష్ట్రంలోని రైతు సమస్యలనుపరిష్కరించాలని కోరుతూ తెలుగుదేశంపార్లమెంటు సభ్యులు గురువారంనాడుకేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిశరద్పవార్ను కోరారు.తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడుకె. ఎర్రంనాయుడు, రావులచంద్రశేఖర్ రెడ్డి, తదితరులుశరద్పవార్ను కలిసి రాష్ట్రంలోనిరైతు సమస్యలను విన్నవించారు.రాష్ట్రంలోని రైతుల ఉత్పత్తులకు కనీసమద్దతు ధర లభించడం లేదనిఎర్రంనాయుడు చెప్పారు. బుధ,గురువారాల్లో ఉన్నతస్థాయిసమావేశం ఏర్పాటు చేసిఆంధ్రప్రదేశ్లోని రైతుల సమస్యలనుపరిశీలిస్తామని శరద్ పవార్ హామీఇచ్చారు.
రాష్ట్రంలోరైతల ఆత్మహత్యలనునిరోధించడంలో, రైతుల ఉత్పత్తులకుగిట్టుబాటు ధర ఇప్పించడంలో ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిప్రభుత్వం విఫమైందని ఎర్రంనాయుడువిమర్శించారు. రైతుల ఉత్పత్తులకునిరుటి కన్నా ఈ ఏడాది వేయి రూపాయలుతక్కువగా వస్తోందని ఆయనచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలవల్ల, వైఫల్యం వల్ల రైతుల పరిస్థితిదిగజారుతోందని రావుల చంద్రశేఖర్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి రఘువీరా రెడ్డికి తన శాఖపైకన్నా ఇతర శాఖలపైనే ఎక్కువ దృష్టి అనిఆయన వ్యాఖ్యానించారు.