చిత్తశుద్ధితో 610 జీవో అమలు: శ్రీనివాస్
హైదరాబాద్: ప్రభుత్వోద్యోగాలకు సంబంధించి తెలంగాణలో స్థానికుల హక్కులను కాపాడే 610 జీవోను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి డి. శ్రీనివాస్ అన్నారు. 610 జీవో అమలుపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని ఆయన శుక్రవారం విలేకరులతో అన్నారు.
అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం అందకపోవడం జీవో అమలులో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. పూర్తి సమాచారం ఇవ్వాలని అన్ని శాఖలను కోరామని ఆయన చెప్పారు. 610 జీవోపై తమ ప్రభుత్వం ఏకాభిప్రాయంతోనే ఉన్నదని, తమ పార్టీదే ప్రభుత్వమైనప్పుడు భిన్నాభిప్రాయలేమిటని ఆయన అన్నారు. 610 జీవోపై ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయం అవసరమని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకుల్లో వ్యక్తిగతంగా భిన్నాభిప్రాయాలుండవచ్చునని, అయితే పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత సమైక్యంగా అచరణలో పెట్టడం మొదటి నుంచీ ఉన్నదని ఆయన అన్నారు.