వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలుగు ప్రతిష్ట ఢిల్లీలో తాకట్టు: చంద్రబాబు
హైదరాబాద్: పదవుల కోసం తెలుగువారి ప్రతిష్టను కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్టుకు ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడం సరి కాదని ఆయన అన్నారు. ఈ విషయంపై నిరంతరం ఉద్యమం కొనసాగిస్తామని ఆయన బుధవారం విలేకరులతో చెప్పారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ నాయకులు కించపరుస్తున్నారని ఆయన అన్నారు. విమానాశ్రయం పేరు మార్పుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దురాగాతాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఛీకొడతారని ఆయన అన్నారు. విమానాశ్రయం పేరు మార్పు అనేది తెలుగువారి ఉనికికి, ప్రతిష్టకు, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, March 16, 2005, 23:53 [IST]