వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్రావిడ్‌ సెంచరీ: భారత్‌ 344/6

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 81 పరుగులతో, రాహుల్‌ ద్రావిడ్‌ సెంచరీతో పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పటిష్టమైన స్థితికి చేరుకుంది. తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ ఆరు వికెట్లను కోల్పోయి 344 పరుగులు చేసింది. రాహుల్‌ ద్రావిడ్‌ 110 పరుగల వద్ద కనేరియా బౌలింగ్‌లో అక్మల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దినేష్‌ కార్తిక్‌ 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

భారత కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌ చక్కటి ప్రారంభాన్ని ఇచ్చారు. సెహ్వాగ్‌ తన సహజ శైలిలో చెలరేగి ఆడాడు. అతను 81 పరుగులు వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుటయ్యాడు. గంభీర్‌ 29 పరుగులు చేశాడు. టెస్టు మ్యాచ్‌ల్లో సచిన్‌ టెండూల్కర్‌ పది వేల పరుగుల మైలురాయి దాటి నలుగురు ప్రపంచ బ్యాట్స్‌మెన్‌ సరసన ఐదోవాడిగా చేరాడు. టెస్టు మ్యాచ్‌ల్లో అతను 40వ అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. సచిన్‌ 52 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గంగూలీ, లక్ష్మణ్‌ వెంటవెంటనే అవుటయ్యారు. గంగూలీ 12 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రజాక్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ వెంటనే లక్ష్మన్‌ అబ్దుల్‌ రజాక్‌ బౌలింగ్‌లోనే ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు. పాక్‌ బౌలర్లు ఆఫ్రిది, రజాక్‌, కనేరియాలో రెండేసి వికెట్లు తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X