వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి తీరుతో సభా సమయం వృధా: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ శాసనసభా సమయాన్ని, డబ్బును వృధా చేస్తోందని శానసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య విమర్శించారు. తెలుగుదేశం తీరు వల్ల శాసనసభలో ప్రజా సమస్యలు మరుగున పడిపోతున్నాయని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

శంషాబాద్‌ అంతర్జాతీయ విమనాశ్రయం డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్టీ ఆర్‌ పేరు పెట్టాలని తెలుగుదేశం సభ్యులు బుధవారం శాసనసభలో గందరగోళం సృష్టించడాన్ని ఆయన తప్పు పట్టారు. తాము ఏ విషయం మీదనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు తెలుగుదేశం పార్టీ నిబంధనల మేరకు ముందుకు రావాలని ఆయన అన్నారు. ప్రధానమైన డిమాండ్లపై సభలో చర్చ జరగాల్సి ఉన్నదని, తెలుగుదేశం వ్యవహార శైలి వల్ల డిమాండ్లు చర్చకు వచ్చే అవకాశం లేకుండా పోతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X