వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవసరాల మేరకు పౌర విమానయానం: సోనియా
అంతకు ముందు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, సంబంధిత కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ ప్రసంగించారు. కేంద్ర మంత్రులు ఎస్. జైపాల్ రెడ్డి, దాసరి నారాయణ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనియా గాంధీకి రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ణచిత్రాన్ని ప్రదానం చేశారు. అనంతరం ఆమె శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి హెలికాప్టర్లో బయలుదేరారు.
అంతకు ముందు సోనియా గాంధీ నిర్ణీత సమయం మధ్యాహ్నం మూడు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఆమె విమానం దిగి రిసెప్షన్ వరకు నడుచుకుంటూ వచ్చారు. అనంతరం వేదిక మీది నుంచి ఒక్కరొక్కరికే అభివాదం చేశారు. రాజశేఖర్ రెడ్డి ఒక్కరొక్కరిని సోనియా గాంధీకి పరిచయం చేశారు.
Comments
Story first published: Wednesday, March 16, 2005, 23:53 [IST]