వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పదిమంది మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో పది మంది నక్సలైట్లు పోలీసు సూపరింటిండెంట్ల ముందు శుక్రవారం లొంగిపోయారు. ఇందులో ఒక మహిళ ఉంది. కరీంనగర్ జిల్లా ఎస్పి డి.యస్. చౌహాన్ ముందు ఎనమండుగురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లు వివిధ ప్రాంతాల్లోని వివిధ దళాలకు చెందినవారని ఎస్పి చెప్పారు. వ్యక్తిగత సమస్యలపై ఆశ్రయించినవారిని నక్సలైట్లు తమలో చేర్చుకున్నారని ఆయన అన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పి ముందు ఇద్దరు నక్సలైట్లు లొంగిపోయారు.
Comments
Story first published: Friday, March 18, 2005, 23:53 [IST]