వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదిమంది మావోయిస్టుల లొంగుబాటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో పది మంది నక్సలైట్లు పోలీసు సూపరింటిండెంట్ల ముందు శుక్రవారం లొంగిపోయారు. ఇందులో ఒక మహిళ ఉంది. కరీంనగర్‌ జిల్లా ఎస్‌పి డి.యస్‌. చౌహాన్‌ ముందు ఎనమండుగురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లు వివిధ ప్రాంతాల్లోని వివిధ దళాలకు చెందినవారని ఎస్‌పి చెప్పారు. వ్యక్తిగత సమస్యలపై ఆశ్రయించినవారిని నక్సలైట్లు తమలో చేర్చుకున్నారని ఆయన అన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లా ఎస్‌పి ముందు ఇద్దరు నక్సలైట్లు లొంగిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X