వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాలుగేళ్లలో హరితాంధ్రప్రదేశ్: వైయస్
హైదరాబాద్: నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా మారుస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన వ్యవసాయ కూలీలకు వరాల వర్షం కురిపించారు.
ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఇల్లు ఉండాలనేది తమ ఉద్దేశ్యమని, అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆరు లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆయన చెప్పారు. అర్హులైనవారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా ఆయన చెప్పారు. మిగులు భూములను గుర్తించి పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద యెత్తున కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, March 18, 2005, 23:53 [IST]