వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెమినీగణేశన్‌ కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:ఒకనాటి మేటి నటుడు జెమినీ గణేశన్‌సోమవారం అర్ధరాత్రి ఇక్కడమరణించారు. ఆయన వయసు 84ఏళ్ళు. ఆయన గత రెండు నెలలుగాఅనారోగ్యంతో బాధపడుతున్నారు. ఐదు దశాబ్దాల నట జీవితంలో ఆయన200కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు,హిందీ, కన్నడ, మలయాళంప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడు. మంగళవారం సాయంత్రం జెమినీగణేశన్‌ భౌతిక కాయానికిఅంత్యక్రియలు జరుగుతాయి.

తమిళసినిమా రంగాన్ని ఏలిన త్రిమూర్తుల్లో జెమినీగణేశన్‌ ఒకరు. మిగితా ఇద్దరు ఎంజిరామచంద్రన్‌, శివాజీ గణేశన్‌లు.ఆయనకు ప్రేమకథా చిత్రాల హీరోగాపేరుంది. ఆయన నలుగురు భార్యల్లోమహానటి సావిత్రి ఒకరు. ప్రముఖ బాలీవుడ్‌నటి రేఖ ఆయన కుమార్తె. ఆయనతన ఎనబయ్యేళ్ల వయస్సులోవ్యక్తిగత కార్యదర్శిని గుడిలోవివాహమాడి సంచలనం సృష్టించారు.చివరి రోజుల్లో ఆయన తన మొదటిభార్య వద్ద ఉన్నారు. 1971 లోఆయనకు పద్మశ్రీ పురస్కారం లభిం చింది.ఎవియం సంస్థ మాంగల్యబలంలో ఆయనకుహీరో పాత్ర అవకాశం వచ్చింది. దాంతోఆయన హీరోగా స్ధిరపడ్డారు. చివరి రోజుల్లోక్యారెక్టర్‌ యాక్టర్‌గా నటించాడు.కమలహాసన్‌ నటించిన భామనేసత్యభామనే అనే సినిమాలో ఆయననటించారు. గణేశన్‌ భౌతిక కాయాన్ని తమిళనాడుమాజీ ముఖ్యమంత్రి కరుణానిధిమంగళవారం ఉదయం సందర్శించినివాళి ఘటించారు.

జెమినీ గణేశన్‌ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం చెన్నైలో జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X