వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యవసాయ, భూసంస్కరణలతో ముందుకు: వైయస్
హైదరాబాద్: వ్యవసాయ, భూసంస్కరణల ద్వారా రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. దక్షిణాసియా ప్రాంతీయ సదస్సును ఆయన బుధవారం ప్రారంభించారు. రైతులను ఆదుకోవడానికి అన్ని రకాల సంస్కరణలను చేపడుతున్నామని ఆయన చెప్పారు.
రైతులకు నీటి, మార్కెట్ సదుపాయాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయం ద్వారా మాత్రమే ఆర్థికాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయార్థిక వ్యవస్థ, గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానిక అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం దశాబ్దం పాటు నిర్లక్ష్యానికి గురైందని, ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.
Story first published: Wednesday, March 23, 2005, 23:53 [IST]