బాలకృష్ణ కాల్పుల కేసు: రేపో మాపో హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: సినీ నటుడు బాలకృష్ణ కాల్పుల కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో తాము ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ గురువారం విలేకరులతో అన్నారు.
సినీ నటుడు బాలకృష్ణ తన ఇంటిలో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరిలపై కాల్పులు జరిపారనే ఆరోపణలకు సంబంధించిన కేసును కింది కోర్టు కొట్టివేసింది. తమపై బాలకృష్ణ కాల్పులు జరిపారని మొదట మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన సురేష్, సత్యనారాయణ చౌదరిలు ఆ తర్వాత మాట మార్చి తమపై కాల్పులు జరిపింది బాలకృష్ణ కాదని చెప్పారు. దీంతో కేసు మొత్తం కింది మీదైంది. ఈ స్థితిలో ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నారు.