వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిపిది క్రూరమైన జోక్‌: కళ్యాణ్‌రావు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కూంబింగ్‌ విషయంలో పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ వేసింది క్రూరమైన జోక్‌ అని మావోయిస్టుల ప్రతినిధి జి. కళ్యాణ్‌రావు వ్యాఖ్యానించారు. విలేకరులు ప్రశ్నించినప్పుడు జేబులోంచి దువ్వెన తీసి తల దువ్వుకుంటూ కూంబింగ్‌ అంటే ఇది అని డిజిపి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అమాయకుల ప్రాణాలను తీయడాన్ని డిజిపి సరదాగా తీసుకుంటున్నారని కళ్యాణ్‌రావు గురువారం విలేకరులతో అన్నారు. వెంటాడి వేటాడి అమాయకులను చంపుతూ స్వీట్లు పంచుకుంటున్నారని ఆయన అన్నారు. వెంటాడి వేటాడి అమాయకులను చంపడం డిజిపికి సరదా ఉన్నదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి పోలీసుల చేతిలో అధికారం పెట్టి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

డిజిపి తీరుపై మజ్లీస్‌ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ గురువారం శాసనసభలో తీవ్రంగా విమర్శలు చేశారు. శాంతిభద్రతలంటే పోలీసులకు ఏ విధమైన వైఖరి ఉందో డిజిపి తీరు సూచిస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X