వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కూలిన థియేటర్: శిథిలాల కింద 20 మంది
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్మాణంలో ఉన్న సినిమా థియేటర్ మంగళవారం సాయంత్రం కూలిపోయింది. దీంతో నిర్మాణ పనులు చేస్తున్న దాదాపు 20 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఆరుగురు కూలీలను స్థానికులు సురక్షితంగా వెలికి తీశారు. ఇంకా 15 మంది దాకా శిథిలాల కింద చిక్కుకుపోయి వుంటారని భావిస్తున్నారు. నిర్మాణంలోని సాంకేతిక లోపాల కారణంగానే భవంతి కూలినట్లు అనుమానిస్తున్నారు.
స్లాబ్ కింద పడిపోయింది. రెండు మూడు శవాలను బయటకు తీస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అధికారులు సహాక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఆరుగురు కూలీల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హాల్ శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారనే భావనతో అధికారులు ఆక్సిజన్ను పంపుతున్నారు.
Comments
Story first published: Tuesday, March 29, 2005, 23:53 [IST]