వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్లో 17 మంది నక్సల్స్ లొంగుబాటు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ( ఎస్పీ) డి.యస్. చౌహాన్ ముందు బుధవారం 17 మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లలో 8 మంది మావోయిస్టులు, ఏడుగురు జనశక్తి నక్సలైట్లు, ఇద్దరు ప్రజాప్రతిఘటన నక్సలైట్లు ఉన్నారు. లొంగిపోయినవారిలో జనశక్తి దళ కమాండర్ ప్రసాద్ అలియాస్ రవి ఉన్నారు. నక్సలైట్ల లొలంగుబాట్లు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎస్పి చౌహాన్ మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎస్పీ చౌహన్ విలేకరులతో అన్నారు. తెలిసీ తెలియక కొంత మంది నక్సలైట్లలో చేరుతున్నారని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, March 30, 2005, 23:53 [IST]