వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు వేర్వేరు చోట్ల జరిగిన మూడు ప్రమాదాల్లో మంగళవారంనాడు 9 మంది మరణించారు. విజయనగరం, ఆదిలాబాద్‌, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో ప్రయాణికుల్లో నలుగురు మరణించారు. ఆటోలని వారు పోరంకి గ్రామానికి చెందినవారని భావిస్తున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆటో ట్రాలీ, లారీ ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం వద్ద లారీ ఒకటి దూసుకుపోవడంతో రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరు మహిళలు మృతి చెందారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X