వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు వేర్వేరు చోట్ల జరిగిన మూడు ప్రమాదాల్లో మంగళవారంనాడు 9 మంది మరణించారు. విజయనగరం, ఆదిలాబాద్, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో ప్రయాణికుల్లో నలుగురు మరణించారు. ఆటోలని వారు పోరంకి గ్రామానికి చెందినవారని భావిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆటో ట్రాలీ, లారీ ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం వద్ద లారీ ఒకటి దూసుకుపోవడంతో రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరు మహిళలు మృతి చెందారు.
Comments
Story first published: Tuesday, April 12, 2005, 23:53 [IST]