వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రా- ఒరిస్సా సరిహద్దులో నలుగురు నక్సల్స్ హతం
విశాఖపట్నం: ఆంధ్రా- ఒరిస్సా సరిహద్దుల్లోని ఏజెన్సీ ప్రాంతంలో గునకరాయి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్ వల్ల విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మరణించిన నక్సలైట్లలో ముగ్గురు మహిళలు ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు 303 రైఫిళ్లు, ఒక డిబియల్, ఒక తపంచా స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు తారసపడిన నక్సల్స్ కాల్పులు జరిపారని, ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని, ఆ ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మరణించారని విశాఖపట్నం ఎస్పి చెప్పారు. ఈ ఎన్కౌంటర్ ఆదివారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో జరిగిందని ఆయన తెలిపారు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ ఎన్కౌంటర్ జరిగింది.
Story first published: Sunday, April 17, 2005, 23:53 [IST]