వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని పార్టీలు అంగీకరిస్తే తెలంగాణపై నిర్ణయం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: అన్ని పార్టీలు అంగీకరిస్తే తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాలలో ఆయన ఆదివారంనాడు రాజీవ్‌నగర బాట నిర్వహించారు. తెలంగాణ వెనకబాటుకు తెలుగుదేశం పార్టీయే కారణమని, సేద్యపు నీటి రంగాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన రాజీవ్‌నగర బాట సభల్లో విమర్శించారు. తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

తమ ప్రభుత్వం బలహీనవర్గాలకు బాసటగా నిలుస్తుందని ఆయన చెప్పారు. నక్సలైట్లపై నిషేధం విధించే విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు వద్ద సిపియం రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిందని ఆయన అన్నారు. జగిత్యాలలో 33 కెవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ మహిళా కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. మెట్‌పల్లిలో 13 కోట్ల రూపాయలతో తలపెట్టిన రాళ్లవాగు ప్రాజెక్టుకు, మున్సిపల్‌ భవనం కార్యాలయానికి, వరద కాలువకు ఆయన శంకుస్థాపన చేశారు. కోరుట్లలో మున్పిపల్‌ కార్యాలయం భవనానికి, 30 పడలక భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X