వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ఒక్క ఆధారమూ చూపలేదు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తప్పు చేసినట్లు తెలుగుదేశం పార్టీ ఏ విధమైన ఆధారాలు చూపలేకపోయిందని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. సోమవారం బెంగుళూర్‌ పర్యటనకు బయలుదేరే ముందు ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులుండవనే భయంతో తెలుగుదేశం పార్టీ భయపడుతోందని, అందుకే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. అసెంబ్లీలో వ్యవహరించిన పద్ధతిలోనే సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చ సందర్భంగానూ తెలుగుదేశం పార్టీ వ్యవహరించిందని, అసెంబ్లీ లోపలా వెలుపలా తెలుగుదేశం పార్టీది ఒకటే తంతు అని ఆయన అన్నారు. బెంగుళూర్‌ పర్యటన సందర్భంగా ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X