వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాలుగేళ్లలో తెలంగాణ సస్యశ్యామలం: వైయస్
ఖమ్మం: నాలుగేళ్లలో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. భద్రాచలంలోని సీతారామకల్యాణానికి వచ్చిన ఆయన ఆదివారంనాడు కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. రాజీవ్సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణాన్ని జూన్, జులై ప్రారంభించనునన్నట్లు ఆయన తెలిపారు. బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తామని ఆయన చెపాపరు.
ప్రాజెక్టులన్నింటనీ పూర్తి చేస్తామని, బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సహాయం అందిస్తుందని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేస్తున్నామని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, April 18, 2005, 23:53 [IST]