వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖమ్మం జిల్లాలో మరో ఎన్కౌంటర్: మందుపాతరలు స్వాధీనం
ఖమ్మం: ఖమ్మంజిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఖమ్మం జిల్లా గుండాల మండలం కాశినపల్లి వద్ద పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని డిఐజి మీనా చెప్పారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు పెద్ద యెత్తున మందుగుండ సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఏడు మందుపాతరలను, 13 కిట్బ్యాగ్లను, మూడు 303 రేఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంగళశారం నక్సల్స్ దాడిలో గాయపడిన చికిత్స పొందుతున్నవారిని డిఐజి మీనా, పోలీసు సూపరింటిండెంట్ భావనా సక్సేనా బుధవారంనాడు పరామర్శించారు. ప్రజాపథం కార్యక్రమానికి హాజరై వస్తున్న అధికారులపై ఖమ్మం జిల్లా గుండాల మండలం చిట్టిపల్లి వద్ద నక్సల్స్ మంగళవారం బాంబులతో దాడి చేశారు.
Comments
Story first published: Wednesday, April 20, 2005, 23:53 [IST]