వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుంటూరులో అగ్నిప్రమాదం: పత్తి మిల్లుల దగ్ధం
గుంటూరు: గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో మూడు పత్తి మిల్లులు పూర్తిగా దగ్ధం కాగా, మరో మూడు పత్తి మిల్లులు పాక్షికంగా కాలిపోయాయి. పెద్ద యెత్తున ఈదురుగాలులు వీస్తుండటంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. మంటలను అర్పడానికి 8 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. ఈదురుగాలులు తగ్గకపోవడంతో మంటలను ఆర్పడం చాలా కష్టంగా ఉంది. అగ్ని ప్రమాదం నష్టం కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా.
Comments
Story first published: Wednesday, April 20, 2005, 23:53 [IST]