వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జులైలో ఎపిపియస్సి గ్రూప్ -2 పరీక్ష
విశాఖపట్నం: గ్రూప్ - 2 పరీక్షలు జూన్, జులై నెలల్లో జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సీనియర్ సభ్యుడు సి. చంద్రశేఖర్ చెప్పారు. నాలుగున్నర లక్షల మంది గ్రూప్ - 2 పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన ఆదివారం విలేకరులతో చెప్పారు. ఇంత పోటీ గతంలో ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. గత తొమ్మిదేళ్లుగా సరిగా నియామకాలు జరగకపోవడంతో ఈ పోటీ పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
200 పాలిటెక్నిక్ లెక్చరర్లు, 106 జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ జారీ అవుతుందని ఆయన చెప్పారు. 400 పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు చేస్తే ఆర్థిక మంత్రిత్వ శాఖ 200 పోస్టులను మంజూరు చేసిందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, April 24, 2005, 23:53 [IST]