వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జులైలో ఎపిపియస్‌సి గ్రూప్‌ -2 పరీక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: గ్రూప్‌ - 2 పరీక్షలు జూన్‌, జులై నెలల్లో జరుగుతాయని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ సీనియర్‌ సభ్యుడు సి. చంద్రశేఖర్‌ చెప్పారు. నాలుగున్నర లక్షల మంది గ్రూప్‌ - 2 పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన ఆదివారం విలేకరులతో చెప్పారు. ఇంత పోటీ గతంలో ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. గత తొమ్మిదేళ్లుగా సరిగా నియామకాలు జరగకపోవడంతో ఈ పోటీ పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

200 పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, 106 జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ అవుతుందని ఆయన చెప్పారు. 400 పాలిటెక్నిక్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు చేస్తే ఆర్థిక మంత్రిత్వ శాఖ 200 పోస్టులను మంజూరు చేసిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X