వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తాం: బర్దన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

జైపూర్‌: తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు తమ లక్ష్యమని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ) ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్‌ అన్నారు. జైపూర్‌లో ఏర్పాటయిన రెండు రోజుల పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్న తమ పార్టీ, ఇతర లౌకిక పార్టీలు కలిసి తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తాయని ఆయన చెప్పారు.

తృతీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీల మీద ఉన్నదని ఆయన అన్నారు. రాజకీయ సవాళ్లు, అనివార్యతల దృష్ట్యా యుపి ఎ ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు. యుపి ఎ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాలను తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. కనీస ఉమ్మడి ప్రణాళిక అమలు కోసం తాము ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. సియంపి అమలు కోసం తాము ప్రజల మద్దతు కోరుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X