వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తృతీయ ఫ్రంట్ ఇప్పుడు ఊహాజనితమే: బాబు
గుంటూరు: తృతీయ ఫ్రంట్ ఏర్పాటు ప్రస్తుతానికి ఊహాజనితమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాజకీయ స్తబ్దత ఏర్పడిన ప్రతిసారీ ఇలాంటి ప్రతిపాదనలు వస్తుంటాయని ఆయన సోమవారంనాడు అన్నారు. మిర్చి రైతులను పరామర్శించేందుకు ఆయన గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఏ పార్టీతోనైనా కలిసి పని చేయడానికి తాము సిద్ధమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఖైదీలు జైళ్లలో కూర్చుని కుట్రలు పన్నుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Comments
Story first published: Monday, April 25, 2005, 23:53 [IST]