వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ కోసం కూంబింగ్లు ఆగవు: డిజిపి
హైదరాబాద్: ఆయుధాల స్వాధీనం ద్వారా మావోయిస్టులను గట్టి దెబ్బ కొట్టగలిగామని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ అన్నారు. గత 45 రోజులుగా స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల ఆయుధాలను, మందుగుండు సామగ్రిని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్నవాటిలో స్థానికంగా తయారు చేసిన రాకెట్ లాంఛర్లు, మందుపాతరలు ఉన్నాయి.
ఆయుధాలను, మందుగుండు సామగ్రిని ఎక్కువగా ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో స్వాధీనం చేసుకున్నట్లు డిజిపి చెపాపరు. గత 45 రోజుల్లో 58 మంది నక్సలైట్లు లొంగిపోయారని ఆయన చెప్పారు. నక్సలైట్ల అణచివేతకు కేంద్రం సహాయం కోరామని ఆయన చెప్పారు. నక్సల్స్ను నిరాయుధాలను చేసే వరకు కూంబింగ్లు జరుగుతాయని ఆయన చెప్పారు. నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు.
Comments
Story first published: Monday, April 25, 2005, 23:53 [IST]