వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి ఆర్‌యస్‌తో మైత్రి కొనసాగుతుంది: కెకె

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)తో మైత్రి కొనసాగుతుందని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు స్పష్టం చేశారు. ఆయన శాంతి సందేశ్‌ యాత్ర సోమవారం నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగింది. టి ఆర్‌యస్‌ మంత్రివర్గం నుంచి వైదొలుగుతుందనే వార్తలు ఊహాగానాలు మాత్రమే అని మీడియా ప్రతినిధులతో అన్నారు.

నక్సలైట్లతో ఎన్ని సార్లయినా చర్చలు జరుపుతామని ఆయన అన్నారు. అయితే చర్చలు దేనిపై జరగాలనేది ముందు స్పష్టం కావాలని ఆయన అన్నారు. కేశవరావు శాంతి సందేశ్‌ యాత్రకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సరంపల్లి గ్రామంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై అవగాహన లేని కేశవరావు శాంతి సందేశ్‌ యాత్ర చేపట్టడమేమిటని వారు ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X