వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై నివేదికకు గడువు లేదు: ప్రణబ్
న్యూఢిల్లీ: తెలంగాణపై నివేదిక ఇవ్వడానికి గడువు ఏదీ నిర్ణయించుకోలేదని తెలంగాణపై ఏర్పడిన ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) సబ్ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే నివేదిక ఇస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణపై కనీస ఉమ్మడి ప్రణాళికలో చెప్పిన దానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ సబ్ కమిటీ రెండో సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. తమ కమిటీ సమావేశం ఇప్పటికిప్పుడు జరగే అవకాశాలు లేవని ఆయన అన్నారు.
సబ్ కమిటీ నివేదిక అందిన తర్వాత తెలంగాణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తన వాదనను సబ్ కమిటీకి వినిపించిందని, సబ్ కమిటీ తన పని తాను చేసుకుని పోతుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, April 26, 2005, 23:53 [IST]