వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యస్పీ వాహనంపై దాడి: యస్పీ క్షేమం, ఒకరు మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం త్వరలో ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నాయకుడు, సాంకేతిక విద్యామంత్రి నాయని నర్సింహారెడ్డి అన్నారు. టి ఆర్యస్ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని ఆర్టీసి క్రాస్ రోడ్డులో పార్టీ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు.
ఎవరు అడ్డుకున్నా తెలంగాణ రాష్ట్రం రావడం ఆగదని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ శక్తులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయని, అయితే ఆ అన్యాయం మాత్రం ఆగడం లేదని ఆయన అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, కోస్తా ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, April 27, 2005, 23:53 [IST]