వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికన్ సెంటర్పై దాడి: ఏడుగురికి మరణశిక్ష
కోల్కత్తా: కోల్కత్తాలోని అమెరికన్ సెంటర్పై దాడి కేసులో అండర్ వరల్డ్ డాన్ అఫ్తాబ్ అన్సారీతో పాటు ఏడుగురికి మరణశిక్ష పడింది. కోల్కత్తాలోని అమెరికన్ సెంటర్పై దాడి కేసులో కోల్కత్తా కోర్టు బుధవారం తన తీర్పును వెలువరించింది. కుట్ర చేసైనందుకు, దేశంపై యుద్ధం చేసినందుకు దుబాయ్కి చెందిన డాన్ అన్సారీ, జమాలుద్దీన్ నసీర్, రెహ్మాన్ ఆలం, ఆదిల్ హసన్, ముషారత్ హుస్సేన్, హస్రత్ ఆలం, షకీర్ అక్తర్లకు కోర్టు మరణశిక్ష విధించింది.
ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను విడుదల చేస్తూ చీఫ్ జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్ బసుదేవ్ మజుందార్ ఆదేశాలు జారీ చేశారు. నేరం రుజువు కానందున దిలీప్ పటేల్, షకీల్ మాలిక్లను విడుదల చేయాలని ఆయన ఉత్తర్వులిచ్చారు.
Comments
Story first published: Wednesday, April 27, 2005, 23:53 [IST]