వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిశు విక్రయాల కేసులో నా జోక్యం మీడియా సృష్టి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: శిశు విక్రయాల కేసులో తాను జోక్యం చేసుకుంటున్నాననే వార్తలు వివిధ సంస్థల, మీడియా సృష్టి అని పోలీసు డైరెక్టర జనరల్‌ స్వరణ్‌జిత్‌ సేన్‌ కొట్టిపారేశారు. శిశు విక్రయాల కేసులో ఐ ఎయస్‌ అధికారి శాలిని మిశ్రాపై కేసు పెట్టడంలో తన పాత్ర లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీనియర్‌ పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారని, వారు ఈ కేసును చూసుకుంటారని ఆయన అన్నారు.

నక్సలైట్లను సమర్థంగా ఎదుర్కోవడానికి సరిహద్దు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని ఆయన అన్నారు. నక్సలైట్లలో పరివర్తన కనిపిస్తోందని, పోలీసులపై నమ్మకం కలుగుతోందని ఆయన అన్నారు. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. మావోయిస్టుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్‌యస్‌ఐని డిజిపి పరామర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X