వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శిశు విక్రయాల కేసులో నా జోక్యం మీడియా సృష్టి
శ్రీకాకుళం: శిశు విక్రయాల కేసులో తాను జోక్యం చేసుకుంటున్నాననే వార్తలు వివిధ సంస్థల, మీడియా సృష్టి అని పోలీసు డైరెక్టర జనరల్ స్వరణ్జిత్ సేన్ కొట్టిపారేశారు. శిశు విక్రయాల కేసులో ఐ ఎయస్ అధికారి శాలిని మిశ్రాపై కేసు పెట్టడంలో తన పాత్ర లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీనియర్ పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారని, వారు ఈ కేసును చూసుకుంటారని ఆయన అన్నారు.
నక్సలైట్లను సమర్థంగా ఎదుర్కోవడానికి సరిహద్దు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని ఆయన అన్నారు. నక్సలైట్లలో పరివర్తన కనిపిస్తోందని, పోలీసులపై నమ్మకం కలుగుతోందని ఆయన అన్నారు. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. మావోయిస్టుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్యస్ఐని డిజిపి పరామర్శించారు.
Story first published: Wednesday, April 27, 2005, 23:53 [IST]