జార్ఖండ్:ఎమ్మెల్యేలకూ మావోయిస్టులకు సంబంధాలు
రాంచి: జార్ఖండ్ శాసనసభ్యులుకొందరికి మావోయిస్టులతో సంబంధాలున్నాయన్నవిషయమై వివాదం చెలరేగుతోంది. ఇటీవలఅరెస్టయిన ఒక మావోయిస్టు, ఇటీవల జరిగినఅసెంబ్లీ ఎన్నికల్లో తాను లెఫ్ట్ పార్టీకి చెందినఒక ఎంఎల్ఎకి సహాయం చేశానని చెప్పడంసంచలనాన్ని సృష్టించింది. ప్రధానంగా రాష్ట్రసంక్షేమ శాఖ మంత్రి రమేష్ సింగ్ముండా ఈ వివాదంలో చిక్కుకున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలోసాయం చేయాలని కోరుతూ రమేష్ సింగ్,మావోయిస్టులతో 25 లక్షల రూపాయల విలువైనఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందురమేష్ సింగ్కు పటిష్ట భద్రత కల్పించేవిషయమై ప్రశ్నిస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ఆఫ్ పోలీస్ ఆర్.సి.కైతాల్ ప్రభుత్వానికిరాసిన లేఖ కూడా ఇందుకు ఊతమిస్తోంది.రమేష్ మావోయిస్టులతో సంబంధాలు కలిగిఉన్నారని, ఆయనను వెంటనే డిస్మిస్ చేయాలనికైతాల్ తన నివేదికలో పేర్కొన్నారని జెడి-యుఎంఎల్ఎ రాధాకృష్ణ కిషోర్ ఒక ప్రకటనలోతెలిపారు. తక్షణం మంత్రి రాజీనామాచేయాలని ఆయన డిమాండ్ చేశారు.