వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేపాల్లో ఎమర్జెన్సీఎత్తివేత
ఖాట్మండు:నేపాల్లోఎమర్జెన్సీని ఆ దేశ రాజు జ్ఞానేంద్ర నిన్న అర్థరాత్రిఎత్తివేశారు. రాజ్యాంగంలోని 115(11) అధికరణాన్నిఅనుసరించి ఎమర్జన్సీ ఎత్తివేసినట్లు రాజభవనంవర్గాలు నిన్న అర్థరాత్రి ఒక ప్రకటనలోతెలిపాయి. ఫిబ్రవరి 1న అధికారపగ్గాలు చేపట్టిన జ్ఞానేంద్ర ప్రభుత్వాన్నిబర్తరఫ్ చేసి, ప్రాథమిక హక్కుల్ని, పత్రికాస్వేచ్ఛను రద్దు చేశారు. గత వారంజకార్తాలో జరిగిన ఆఫ్రో- ఆసియా శిఖరాగ్రసదస్సులో ప్రధాని మన్మోహన్ సహా ఇతరదేశాధినేతలతో సంప్రదింపులు జరిపినసందర్భంలో నేపాల్లో బహుళ పార్టీ ప్రజాస్వామ్యాన్నిపునరుద్ధరించటానికి చర్యలు చేపడతాననిజ్ఞానేంద్ర హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాతమాజీ ప్రధాని దేవ్బాను అరెస్టు చేయించటంతోజ్ఞానేంద్ర చర్యను భారత్, తదితరదేశాలు తీవ్రంగా ఖండించాయి. సదస్సులో ఇచ్చినహామీలకు నీళ్ళొదిలారని అన్ని దేశాలు మండిపడ్డాయి.
Comments
Story first published: Saturday, April 30, 2005, 23:53 [IST]