వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోల్‌మాల్‌ జరిగిందన్న టిడిపి - లేదన్న సీతాపతి

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: పుష్కర ఎత్తిపోతల పథకంపై బహిరంగ చర్చ యధావిధిగా వేడిగా వాడిగా జరిగింది. టెండర్లలో గోల్‌మాల్‌ జరిగిందని తెలుగుదేశం ప్రతినిధి సానా మారుతి ఆరోపించారు. అది నిజం కాదని ప్రభుత్వ సాగునీటి సలహాదారు సీతాపతి రావు అన్నారు. తెలుగుదేశం అనవసర రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్‌ ప్రతినిధి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. అతి తక్కువ కోట్‌ చేసిన ఎల్‌ అండ్‌ టికి కాంట్రాక్టు ఇవ్వలేదని, దీన్ని బట్టే టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయని చెప్పవచ్చునని మారుతి అన్నారు. అయితే ఎల్‌ అండ్‌ టి నిబంధనలను పాటించలేదని, అందుకే ఆ సంస్థ టెండర్‌ను ఖరారు చేయలేదని మారుతి చెప్పారు.

ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మారుతి ప్రధానంగా ప్రస్తావించారు. పుష్కర ఎత్తిపోతల పథకాన్ని 2006 నాటికి పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఈ బహిరంగ చర్చలో నీటి పారుదల ముఖ్య కార్యదర్శి శర్మ పాల్గొనలేదు. ప్రాజెక్టు వద్ద బహిరంగ చర్చను నిర్వహించాలనే ఉద్దేశంతో ఆదివారంనాడు పుష్కర ఎత్తిపోతలపై రాజమండ్రి ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో చర్చను నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X