వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆందోళనా పథంలో జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనా పథం పట్టనున్నారు. 15 వైద్య కళాశాలల కొనసాగింపును నిరసిస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు జూనియర్ డాక్లర్ల సంఘం అధ్యక్షుడు సురేష్ బాబు ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. జస్టిస్ జీవన్ రెడ్డి కమీషన్ సూచనను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం 15 వైద్య కళాశాలలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ కళాశాలలను కొనసాగిస్తూ జారీ చేసిన 22, 58 జీవోలను వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ను పది రోజుల్లో అంగీకరించకపోతే ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మార్గంలోనే నడుస్తుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, May 1, 2005, 23:53 [IST]