వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భూపతిపాలెం కాంగ్రెస్ చలువే: పొన్నాల లక్ష్మయ్య
విజయనగరం: భూపతిపాలెం ప్రాజెక్టు కాంగ్రెస్ చలువేనని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్యయ్య అన్నారు. ప్రాజెక్టు పనులు 40 శాతం పూర్తయ్యాయని ఆయన విలేకరులతో అన్నారు. భూపతి పాలెం ప్రాజెక్టు పనులను ఆయన మంగళవారం పరిశీలించారు.
నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని, ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న 200 కుటుంబాలకు మెరుగైన జీవితం అందించేలా పునరావాస చర్యలుంటాయని ఆయన అన్నారు. గిరిజనుల కోసం నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్టు ఇది అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 23 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన చెప్పారు. భూపతిపాలెం ప్రాజెక్టుపై వచ్చే ఆదివారం బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Comments
Story first published: Tuesday, May 3, 2005, 23:53 [IST]