భానుమతి టికెట్పై అధిష్ఠానానిదే నిర్ణయం: కెకె
వరంగల్: వచ్చే పెనుకొండ ఉప ఎన్నికల్లో గంగుల భానుమతికి టికెట్ ఇవ్వాలా, వద్దా అనే విషయంపై తమ పార్టీ అధిష్ఠాన వర్గం చూసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. ఫ్యాక్షనిస్టులకు టికెట్ ఇవ్వవద్దని తాము తెలుగుదేశం పార్టీకి సూచించామని ఆయన చెప్పారు. కేశవరావు శాంతి సందేశ్ యాత్ర మంగళవారం వరంగల్ జిల్లాలో సాగింది.
పరిటాల రవిది ఫ్యాక్షనిస్టుల హత్య అయినందున ఏక।గ్రీవం అయ్యే అవకాశం లేదని ఆయన అన్నారు. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆరేపల్లిలో ఆయన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తన శాంతి యాత్రతో రాష్ట్రంలో శాంతి నెలకొంటుందని తాను అనుకోవడం లేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రంగాపురం గ్రామంలో మంచినీళ్లు అడిగిన ప్రజలపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో గ్రామస్తులు ప్రజలపై తిరగబడ్డారు. లక్ష్మీపురంలో సమస్యల పత్రాన్ని సమర్పించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.