వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘోర రోడ్డు ప్రమాదం: పసిపాప సహా 10 మంది మృతి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం సోన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి టాటా సుమో దాన్ని ఢీకొట్టింది. సుమోలో ప్రయాణిస్తున్న పది మందిలో డ్రైవర్తో సహా తొమ్మిది మంది మరణించారు. ఆ తర్వాత మరొకరు కూడా మరణించారు.
మహారాష్ట్ర నాగాపూర్లోని తెలుగువారు మెదక్ జిల్లా సిద్ధిపేటలోని తమ బంధువుల ఇంటికి టాటా సమోలో వెళ్తున్నారు. సుమో సోన్ వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. మరణించినవారిలో ఒక పసిపాప, ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతదేహాలను క్రేన్ సహాయంతో వెలికి తీశారు.
Comments
Story first published: Wednesday, May 4, 2005, 23:53 [IST]