నక్సల్స్ దాడి: మృతుడు పదో తరగతి బాలుడు?
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) మహేశ్చంద్ర చడ్డాపై మావోయిస్టులు చేసిన దాడిలో తునాతునకలైన శవం మిస్టరీ వీడుతోంది. మావోయిస్టులు యస్పీ చేసిన దాడిలో ఒక వ్యక్తి శవం గుర్తు పట్టరానంతగా తునాతునకలైంది. ఇప్పటి వరకు ఆ శవం ఎవరిదనేది తెలియలేదు.
ఆ శవం పదో తరగతి పూర్తి చేసిన గొర్లగుట్టకు చెందిన సుబ్బరామయ్య కుమారుడు మహేష్బాబుది కావచ్చునని అనుమానిస్తున్నారు. తన కుమారుడు ఏప్రిల్ 27వ తేదీ నుంచి కనిపించడం లేదని సుబ్బరామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పదో తరగతి పరీక్షలు రాసిన మహేష్ స్పోకెన్ ఇంగ్లీష్ చదువుకుంటున్నాడు. కంప్యూటర్ ఇనిస్టిట్యూట్కు వెళ్లిన మహేష్ ఇంటికి తిరిగి రాలేదు. ఎంత ప్రయత్నించినప్పటికీ తన కొడుకు ఆచూకీ తెలియలేదని సుబ్రహ్మణ్యం చెబుతున్నాడు. ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక వస్తే మరణించింది మహేషా, కాదా అనేది ధృవపడుతుంది.