వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజమండ్రిలో నర్సు ఆనుమానాస్పద మృతి
రాజమండ్రి: రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో స్టాఫ్నర్సు అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ విషయాన్ని తమకు చాలా ఆలస్యంగా తెలియజేసినందుకు నర్సు బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. నర్సుది హత్యేనని ఆరోపిస్తూ వారు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాజమండ్రిలో ఉద్రిక్తత నెలకొంది.
స్టాఫ్నర్సు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట, రెండు గంటల మధ్యలో మరణించినట్లు సమాచారం. తాము పై అంతస్థులో పడి ఉన్న నర్సును చాలా ఆలస్యంగా చూశామని, ఆమె వెళ్లిపోయిందని అనుకున్నామని ఆస్పత్రి నిర్వాహకులు అంటున్నారు. ఆమెది మచ్చ లేని వ్యక్తిత్వమని, నిబద్ధతతో పని చేసేదని వారంటున్నారు.
Comments
Story first published: Wednesday, May 4, 2005, 23:53 [IST]