ఫెర్నాండెజ్కు క్లీన్చిట్ ఇవ్వలేదు: ఫుకాన్
సూర్యాపేట: తాను మీడియాపై ఆగ్రహం గానీ, అసహనం గానీ ప్రదర్శించలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు స్పష్టం చేశారు. కేశవరావు మీడియాపై అసహనం ప్రదర్శించినట్లు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆయన బుధవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. తాను చేపట్టిందే శాంతి యాత్ర అని, అందువల్ల ఆగ్రహం వ్యక్తం చేసే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఒక వేళ తాను అసహనం ప్రదర్శించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు.
అయితే ఒక విషంయ స్పష్టం చేయదలుచుకున్నానని, కాంగ్రెస్ నాయకుల్లో బడా, చోటా అనే తేడాలుండవని, ముఖ్యకార్యకర్తలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారని, అంతేనని ఆయన అన్నారు. సమస్యలతో వచ్చిన తెలుగుదేశం, బారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.